స్విచ్ ఛాలెంజ్ పద్దతిలో మొక్కబడిగా టెండర్లపిలచి అనుకున్న కంపెనీలకు కట్టబెటాలని కుట్ర జరుగుతుంద న్నారు. మూడువేల ఎకరాలు భూమిని ప్రభుత్వవాటాగా విదేవీ కంపెనీలు ఆర్థిక రూపంలో పెట్టుబడులు పెడతా యని వచ్చిన లాభాలను పంచుకుంటా మని ముఖ్యమంత్రే చెప్పారని ప్రభు త్వం పరిపాలన చేయాలే తప్స వ్యాపం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. మూడు వేల ఎకరాలు భూమి విలువసుమారు 7500 కోట్లు ఉంటుందని ప్రభుత్వం ఏధరను నిర్ణయించిందో బయటపెట్టాలన్నారు. ప్రైవేటు భాగస్వామ్యానికి సంబంధించిన విధి విదానాలను వెల్లడించాలన్నారు. 29 గ్రామాలల్లో నిర్మాణాలు ఎప్పడు చేస్తోరో చెప్పాలన్నారు. ఉద్యోగులుపేదుల ఇతరులు నివాస గృహాలు ఎవరు నిర్మిస్తారు. వాటిని ఎలాకేయిస్తారో సీడ్ క్యాపిటల్ ప్రస్తుత గ్రామాలు కొనసపాగిస్తారా? తొలగిస్తారా? తదితర ప్రశ్నల కు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నానని, ఇక్కడకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని, చైనా నుంచి ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని శుక్రవారం విజయవాడ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనాలో పారిశ్రామికవేత్తలను కలిశానని, ఉత్తమ నైపుణ్యాలకు చైనా మారుపేరని, ప్రపంచంలోని వేగవంతమైన రైళ్లన్నీ చైనాలోనే ఉన్నాయని, మనకంటే ముందే చైనాలో సంస్కరణలు అమలయ్యా యని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండోతరం పారిశ్రామికవేత్తలను తయారు చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలో నెంబర్ వన్ పెట్టుబడిదారులు యూదులని, ఏపీలో కూడా అంతటి శక్తి సామర్థ్యాలున్నాయని ఆయన అన్నారు. ఏపీ పారిశ్రామికవేత్తలను ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని, మనవాళ్లు ఇతర దేశాల్లో వ్యాపారం చేయాలని, బయటివారు మన దగ్గర వ్యాపారం చేయాలని చంద్రబాబు అన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెస్ దెబ్బతీసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఇమేజ్ను ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, నీతి, నిజాయితీగా ఏపీలో ఉన్న పారిశ్రామిక వేత్తలను ఉత్తమ పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. చైనాలో 60 అంతస్తుల భవనాన్ని 30 రోజుల్లో కట్టారని ప్రధాని మోడీ తనతో చెప్పారని చంద్రబాబు అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు ఆన్స్టీల్ సంస్థ, లిబ్రా గ్రూప్ నౌకాయానం, ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయని, చైెనాలో ఉన్నా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిణామాలను తెలుసుకున్నానని ఆయన అన్నారు. దేశమంతా ఎల్ఈడీ బల్బులు వాడితే రూ. 40 వేల కోట్లు ఆదా అవుతుందని, విద్యుత్ పొదుపు చేసే పంపుసెట్ల వాడకంపై దృష్టి పెట్టినట్లు చంద్రబాబు వెల్లడించారు. టెక్నాలజీ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నామని, ఊహకు అందని రాజధానిని నిర్మిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో 9 నగరాలను అభివృద్ధి చేస్తామని, రాజధానిలో హైటెన్షన్ వైర్లకే రూ.1500కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ తెలంగాణకే చెందుతుందనడం సరికాదని, అందరూ కష్టపడి ఏపీ భవన్ను నిర్మించారని అన్నారు. గొడవల వల్ల సాధించేదేమీ లేదని, హైదరాబాద్ బాగుండాలి, అమరావతి బాగుండాలని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతిని కలిశానని, పోలవరానికి నాబార్డు నిధులు కేటాయించాలని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. నీటి విషయంలో అపెక్స్ కమిటీ వేయాలని, రాష్ట్రాలే సమస్య పరిష్కరించుకోవాలనడం సరికాదని, కేంద్రం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నానని, ఇక్కడకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని, చైనా నుంచి ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని శుక్రవారం విజయవాడ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనాలో పారిశ్రామికవేత్తలను కలిశానని, ఉత్తమ నైపుణ్యాలకు చైనా మారుపేరని, ప్రపంచంలోని వేగవంతమైన రైళ్లన్నీ చైనాలోనే ఉన్నాయని, మనకంటే ముందే చైనాలో సంస్కరణలు అమలయ్యా యని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండోతరం పారిశ్రామికవేత్తలను తయారు చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలో నెంబర్ వన్ పెట్టుబడిదారులు యూదులని, ఏపీలో కూడా అంతటి శక్తి సామర్థ్యాలున్నాయని ఆయన అన్నారు. ఏపీ పారిశ్రామికవేత్తలను ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని, మనవాళ్లు ఇతర దేశాల్లో వ్యాపారం చేయాలని, బయటివారు మన దగ్గర వ్యాపారం చేయాలని చంద్రబాబు అన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెస్ దెబ్బతీసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఇమేజ్ను ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, నీతి, నిజాయితీగా ఏపీలో ఉన్న పారిశ్రామిక వేత్తలను ఉత్తమ పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. చైనాలో 60 అంతస్తుల భవనాన్ని 30 రోజుల్లో కట్టారని ప్రధాని మోడీ తనతో చెప్పారని చంద్రబాబు అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు ఆన్స్టీల్ సంస్థ, లిబ్రా గ్రూప్ నౌకాయానం, ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయని, చైెనాలో ఉన్నా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిణామాలను తెలుసుకున్నానని ఆయన అన్నారు. దేశమంతా ఎల్ఈడీ బల్బులు వాడితే రూ. 40 వేల కోట్లు ఆదా అవుతుందని, విద్యుత్ పొదుపు చేసే పంపుసెట్ల వాడకంపై దృష్టి పెట్టినట్లు చంద్రబాబు వెల్లడించారు. టెక్నాలజీ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నామని, ఊహకు అందని రాజధానిని నిర్మిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో 9 నగరాలను అభివృద్ధి చేస్తామని, రాజధానిలో హైటెన్షన్ వైర్లకే రూ.1500కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ తెలంగాణకే చెందుతుందనడం సరికాదని, అందరూ కష్టపడి ఏపీ భవన్ను నిర్మించారని అన్నారు. గొడవల వల్ల సాధించేదేమీ లేదని, హైదరాబాద్ బాగుండాలి, అమరావతి బాగుండాలని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతిని కలిశానని, పోలవరానికి నాబార్డు నిధులు కేటాయించాలని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. నీటి విషయంలో అపెక్స్ కమిటీ వేయాలని, రాష్ట్రాలే సమస్య పరిష్కరించుకోవాలనడం సరికాదని, కేంద్రం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అన్నారు.
స్విస్ ఛాలెంజ్కు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
అందరూ ఊహించినట్లుగానే ఏపీ సర్కార్ స్విస్ ఛాలెంజ్ పద్ధతికి ఆమోదం తెలిపింది. ప్రజలు.. ప్రతిపక్షాలు స్విచ్ ఛాలెంజ్ను వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మొండిగా ముందుకెళ్తున్నారు. స్విస్ ఛాలెంజ్ ప్రకారం సింగపూర్ సంస్థలకు అమరావతిలో భూములు అప్పగించనున్నారు. రాజధాని అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే కంపెనీలో సింగపూర్ సంస్థలకు 58 శాతం వాటా, ఏపీ సర్కారుకు 42 శాతం ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. సర్కారు కట్టేది రాజధాని మాత్రమేనని..మిగిలింది అంతా లే అవుట్ రెడీ చేస్తామని చెప్పారు. స్విస్ ఛాలెంజ్ పై కొంత మంది విమర్శలు చేస్తున్నారని…చాలా క్షుణ్ణంగా అన్ని అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాజధాని అభివృద్ధికి ముందుకొచ్చిన సంస్థలు అసెండాస్, సెంబ్ కార్ప్, సింగ్ బ్రిడ్జిల్లో సింగపూర్ ప్రభుత్వానికి 74 శాతంపైగా వాటా ఉందని..మిగిలిన వాటా ప్రజల చేతుల్లో ఉందని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి డెవలప్ మెంట్ కన్షార్షియంకు 1691 ఎకరాలు అప్పగించనున్నట్లు తెలిపారు. 50 ఎకరాలు మాత్రం నామమాత్రపు ధరకు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మన దేశంలో ఎన్టీపీసీ, ఓఎన్ జీసీ సంస్థలు ఎలాంటివో అసెండాస్ , సింగ్ బ్రిడ్జి సెంబ్ కార్ప్ సంస్థలు అటువంటివే అని తెలిపారు.
అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్ కోసం 50 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు మరికొన్ని సంస్థలకు కూడా భూములు కేటాయించారు. వీఐటీ విద్యాసంస్థకు 200 ఎకరాలు కేటాయించారు. ధర ఎకరానికి 50 లక్షలకే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కు 5 ఎకరాలు, ఎన్ఐడీకి 50 ఎకరాలు ఏపీ హెచ్ఆర్‑డీఏకి 25 ఎకరాలు, టీటీడీకి 25 ఎకరాల భూమిని ఎకరానికి 50 లక్షలకే విక్రయిస్తున్నట్లుగా చంద్రబాబు పేర్కొన్నారు. మరికొన్ని కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వాటిపై మరోసారి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా స్విస్ ఛాలెంజ్ పద్ధతితో మునుముందు ఎదురు కానున్న పరిణామాలను సర్కార్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.